కూనపరెడ్డి రాజారావును పరామర్శించిన బండ్రెడ్డి రామ్

*కైకలూరు నియోజకవర్గ జనసేన నాయకులు కూనపరెడ్డి రాజారావు ను పరామర్శించిన బండ్రెడ్డి రామ్ మరియు ముదినేపల్లి మండల జనసేన నాయకులు

కైకలూరు నియోజకవర్గం, ముదినేపల్లి మండలం, కొమ్మరు గ్రామ వాస్తవ్యులు ముదినేపల్లి మండల జనసేన నాయకులు కూనపరెడ్డి రాజా రావు తండ్రి కూనపరెడ్డి హరి దాసు ఈ నెల 27వ తారీఖున స్వర్గీయులయ్యారు. కూనపరెడ్డి హరి దాసు కుటుంబాన్ని కృష్ణా జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ(రామ్) ముదినేపల్లి మండలం విచ్చేసి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్బంగా బండ్రెడ్డి రామ్.. కూనపరెడ్డి హరిదాసు చిత్రపటానికి ఘన నివాళులర్పించి.. అనంతరం రామ్ మాట్లడుతూ.. గ్రామ పెద్దలుగా ఎన్నో సేవకార్యక్రమాలు చేస్తూ తనదైన శైలిలో పేరు పొందిన వ్యక్తి మన నుండి దూరం కావటం చాలా బాధాకరం అని, అయన ఆత్మకు శాంతిచేకూరాలి అని రామ్ ప్రార్ధించారు. బండ్రెడ్డి రామ్ వెంట ముదినేపల్లి మండల అధ్యక్షులు వీరంకి వెంకయ్య, కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి వేల్పూరి నానాజీ, కృష్ణా జిల్లా ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు చెన్నంశెట్టి చక్రపాణి, ముదినేపల్లి మండల జనసేన నాయకులు మోటేపల్లి హనుమా, పోకల కృష్ణ, కృష్ణా జిల్లా బీజేపీ యువ మోర్చా నాయకులు కోటప్రోలు కృష్ణా, అంబుల భరత్, కొత్తపల్లి జనసైనికులు పాశం శ్రీను, సుదాబత్తుల సాయిష్, బోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొని హరిదాసు గారి చిత్రపటానికి ఘన నివాళులర్పించారు.