గుడివాడ నియోజకవర్గం నుంచి జనసేనలో చేరికలు

గుడివాడ నియోజకవర్గం, గుడ్లవల్లేరు గ్రామంలో శనివారం ఉదయం 11 గంటలకు దళితులు జనసేన పార్టీ పట్ల ఆకర్షితులై, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరుస్తూ.. కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ అధ్యక్షతన, ఇన్ ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది దళితులు జనసేన పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొదమల గంగాధర రావు, జిల్లా కార్యదర్శిపేర్ని జగన్, వెనుతురుమిల్లి గ్రామం జనసేన సర్పంచ్ కొప్పినేని శేషావేణి, గుడివాడ రూరల్ మండలం అధ్యక్షుడు ఇంటూరి గజేంద్ర, నందివాడ మండలం అధ్యక్షుడు సూవ్వరి తారక రామారావు, గుడివాడ పట్టణ నాయకులు షేక్ మీరా షరీఫ్, వేమూరి త్రినాధ్, ఆకుల మోహన్, జేమ్స్, సాయి పవన్, రాజేష్, జనార్ధన రావు, తదితరులు పాల్గొన్నారు.