శ్రీ రాధాకృష్ణ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో కందుల దుర్గేష్

రాజమండ్రి రూరల్ మండలం శాటిలైట్ సిటీ గ్రామంలో శ్రీ రాధాకృష్ణ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ మరియు రాజమండ్రి నగర అధ్యక్షులు వై శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది. తదనంతరం శాటిలైట్ సిటీ జనసైనికుడు శివరామకృష్ణ కి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండడంతో శివరామకృష్ణ ఇంటికి వెళ్ళి అతని ఆరోగ్యం గురించి ఎలా ఉందో తెలుసుకొని పరామర్శించి స్థానిక జనసైనికులు ఆర్థిక సాయం చేయగా దానిని జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ మరియు రాజమండ్రి నగర అధ్యక్షులు వై శ్రీనివాస్ చేతుల మీదగా ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాటిలైట్ సిటీ జనసైనికులు చౌడడ సునీల్, గోడిసిపూడి నాగేంద్ర, ఎలుగుబంటి దుర్గారావు, పాలవలస గోపి, దీప్తి మహంతి సుబ్బారావు, పోలూరి శ్రీను, పీతల సూరిబాబు, సేశెట్టి ప్రసాద్ బాబు, శీలం సురేష్, గోడిసి పూడి సుబ్రమణ్యం, చుక్క గౌరీ నాయుడు. మరియు జనసైనికులు పాల్గొన్నారు.