జనసేన బలోపేతం కోసం సుడిగాలి పర్యటన, ఉపాధి కూలీలతో భేటీ: కరిమజ్జి మల్లీశ్వారావు

ఎచ్చెర్ల, జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఈరోజు ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం గ్రామ చెరువులో ఉన్న ఉపాధి కూలీలతో జనసేన బలోపేతం కోసం ప్రజలతో బుడుగు బలహీన వర్గాలు వారు ముందుకు రావాలని మాట్లాడుతూ జనసేనకు ఈసారి అవకాశం ఇవ్వాలని అలాగే జనసేనపార్టీ సిద్దాంతాలను పవన్ కళ్యాణ్ ఆదర్శాలను మరియు ఆచరించే విధానాలను ప్రజలకు కరిమజ్జి మల్లీశ్వారావు వివరించడం జరిగింది. టిడిపి, వైసీపీ ప్రభుత్వ పాలన చూశారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి జనసేన పార్టీ పాలన కూడ ప్రజలు చూడాలని ఆయన కోరారు. రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాల వారికి మేలు చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు వంటి పవన్ కళ్యాణ్ కి వచ్చే ఎన్నికల్లో జనసేనపార్టీకి మద్దతు ఇవ్వాలని కరిమజ్జి మల్లీశ్వారావు మరియు పోట్నూరు లక్ష్మునాయుడు, కోరడమైనది. ఈ కార్యక్రమంలో రణస్థలం గ్రామ ప్రజలు, పెద్దలు మహిళలు చాలా మంది పాల్గొన్నారు.