గ్రావెల్ దందాని తక్షణమే ఆపాలని జనసేన డిమాండ్

కోవూరు నియోజకవర్గం పరిధిలోని తలమంచి మరియు కావలి నియోజకవర్గం పరిధిలోని నార్త్ ఆములూరు గ్రామ శివార్లలోని అటవీ ప్రాంతంలో చెట్లను తొలగించి గ్రావెల్ ని అక్రమంగా తరలించేస్తున్నారు. దాదాపు రెండు కిలోమీటర్ల దూరం వరకు 30 గడుగులు లోతుకి గ్రావెల్ తోవ్వేసి అక్రమ సంపాదనకు ఈ గ్రావెల్ మాఫియా తెరలేపారు. ఈ విషయాన్ని నెల్లూరు జిల్లా ప్రభుత్వ అధికారులు అలాగే అటవీ శాఖ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. ఒక్క రోజుకు కనీసం 500 టిప్పర్లు లోడుతో ఈ గ్రావెల్ తరలించడం జరుగుతుంది. ఈ అక్రమ గ్రావెల్ తరలించే క్రమంలో ఆ ప్రాంతంలో ఉండే పొలాలు మొత్తం నాశనం అయిపోయాయి. గ్రామం మొత్తం పూర్తిగా ఎర్ర మట్టితో నిండిపోయింది. అధిక సంఖ్యలో టిప్పర్లు తిరగడం వలన రోడ్లు పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. అధికారులకు పలుమార్లు చెప్పినాకుడా ఏమీ ప్రయోజనం లేదు, పైగా వైసీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని గ్రామస్థులు చెప్తున్నారు. ఈ దందాలో వైసీపీ ఎమ్మెల్యే లు భాగస్వామ్యులు అయిఉన్నారని, వాళ్ళని ఎదిరించే ధైర్యం లేక గమ్ముగా ఉండిపోవలసి వస్తుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని జనసేనపార్టీ తీవ్రంగా ఖండిస్తూ జిల్లా ప్రభుత్వ అధికారులకు, అలాగే కావలి ఆర్డీఓ కి, అల్లూరు మండల తహశీల్దార్ కి, నెల్లూరు ఆర్డీఓ కి జనసేనపార్టీ తరుపున ఈ గ్రావెల్ దందాని తక్షణమే ఆపేసి పర్యావరణాన్ని కాపాడవలసిందిగా కోరడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా జనసేనపార్టీ ఉపాధ్యక్షులు బద్ధిపూడి సుధీర్, ప్రధాన కార్యదర్శి ముల్లా మున్వర్ బాషా, కార్యదర్శి సురాయపాలేం పవన్ కుమార్, విడవలూరు మండల జనసేనపార్టీ అధ్యక్షులు కమతం శ్రీనాథ్ యాదవ్, కోవూరు మండల జనసేనపార్టీ అధ్యక్షుడు అల్తాఫ్ జనసేనపార్టీ నాయకులు చప్పిడి శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.