సీఐ చేతుల మీదగా దాసరి యూట్యూబ్ న్యూస్ ఛానల్ ప్రారంభం

ఇచ్చాపురం, యాజమాన్యం దాసరి శేఖర్ ల జే ఎస్ పి దాసరి న్యూస్ ఛానల్ ని ఆదివారం సీఐ సతీష్ బాబు చేతుల మీద గా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని అన్నారు. వాస్తవాలు వెలుగులోకి తెచ్చి, పట్టణా భివృద్ధికి తోడ్పాడాలని పట్టణ ఎస్ ఐ సత్యం నారాయణ అన్నారు. న్యూస్ ఛానల్ నడపడానికి పదేళ్ల అనుభవం ఉన్న శేఖర్ అన్ని విధాలుగా సమర్థుడని జనసేన సమన్వయ కర్త దాసరి రాజు
అన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకోని వెళ్లాలని ప్రధాన ఉద్దేశ్యంతో ఈ జే ఎస్ పి దాసరి న్యూస్ ఏర్పాటు చేశామని శేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకర్, కోట రామారావు, అజ్జు భాస్కర్ సాయి, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.