జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ

చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గ ఇన్చార్జ్ డా. ముద్దినేని వెంకటరమణ అధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథిగా.. రామకుప్పం మండలంలోని సింగసముద్రం పంచాయతీలో, గుడుపల్లి మండలం యమగాని పల్లె పంచాయితీలోని ఏ.బి.వాడ నందు మరియు వీరనమల తండాలో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా కమిటి సభ్యులు మరియు మండల కమిటీ అధ్యక్షులు హరీశ్, పవన్ కుమార్, భాస్కర్ ,శ్రీకాంత్, షేన్ షా, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొనీ 2024లో పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఏర్పడుతుందని.. తెలుగు బలహీన అందరికీ మంచి ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు.