శ్రమదాన కార్యక్రమంలో ఇన్నేసుపేట జనసేన
ఇచ్చాపురం నియోజకవర్గం సమన్వయకర్త దాసరి రాజు పర్యటన వివరాలు ముందుగా ఇన్నేసు పేట గ్రామంలో ఈనెల 30 తారీకు నుంచి జరగబోయే దుర్గమ్మ సంబరాలు కారణంగా ఆ గ్రామంలో గుంతలు పడిన రోడ్లు చూసి ఆ గ్రామస్తులు, పెద్దలు, జనసైనికులు, అందరూ కలిసి డబ్బులు వేసుకొని ఆ గుంతలను పూడ్చి వెయ్యడం జరిగింది. ఆ కార్యక్రమంలో దాసరి రాజుని మర్యాదపూర్వకంగా ఆహ్వానించడం జరిగింది. ఈ శ్రమదాన కార్యక్రమంలో ఇన్నేసు పేట జనసేన యూత్ లీడర్ దుంగు భాస్కర్ రావు, మున్సిపాలిటీ 10వ వార్డు రోకళ్ళ భాస్కర్ రావు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-26-at-4.35.36-PM-1024x460.jpeg)