మరోసారి అధికారంలోకి రావడం కోసమే కోనసీమ అంబేద్కర్ జిల్లా పేరుతో వైసీపీ నాటకం

*ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు బైరపోగు సాంబశివుడు మాదిగ

ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళిత బహుజనులు జనసేన పార్టీ ద్వారా రాజ్యాధికారంలో కి వస్తారనే భయంతోనే.. దళిత బహుజనులు జనసేన పార్టీకి దగ్గరవుతున్నారు అన్న భయంతోనే.. జగన్మోహన్ రెడ్డి కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును అడ్డుపెట్టుకొని జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని దెబ్బకొట్టాలని చూస్తున్నారు తప్ప నిజానికి రాజకీయంగా జనసేన పార్టీని ఎదుర్కోలేకనే ఇలాంటి ఘటనలకు జనసేన పాల్పడుతుందంటూ తప్పుడు ప్రచారం చేస్తుంది, నిజానికి ఈ ఘటనలకు తన కార్యకర్తలతో వైసీపీ పాల్పడుతుంది. నిజానికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి దళితులపైన చిత్తశుద్ధి ఉంటే దేశంలోనే ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైన రాష్ట్రంగా ఎందుకు ఉంది….? వైసిపి నాయకులు కార్యకర్తలు దళితుల మీద దాడులు చేస్తున్నారు దీన్ని అడ్డుకోవడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైంది.

దళితులపైన దాడులకు దిగిన వైసీపీ నాయకులను శిక్షించకుండా వాళ్లకు మీ ప్రభుత్వం అండగా నిలుస్తుంది. నిజంగా వైసీపీ ప్రభుత్వానికి ఎస్సీ, ఎస్టీ పైన చిత్తశుద్ధి ఉంటే 10 వేల కోట్లు ఎస్సీ. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఎలా దారి మళ్లిస్తారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న దళిత యువతకు ఇప్పటికి ఎందుకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేదు.
ఇవన్నీ పక్కనపెట్టి యువతను ప్రజలను తప్పుదోహ పట్టించడం కోసం కోనసీమ అంబేద్కర్ జిల్లా పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న రాజకీయ కుట్ర తప్ప.. నిజానికి అంబేద్కర్ పైన గాని.. ఆయన ఆశయాల పైన గాని.. ఎలాంటి చిత్తశుద్ధి లేని ఈ ముఖ్యమంత్రి కి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు అని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు బైరపోగు సాంబశివుడు మాదిగ ఒక ప్రకటనలో తెలియజేశారు.