ప్రకాశ్‌రాజ్‌ చాలెంజ్‌ను స్వీకరించిన త్రిష

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి నటి త్రిష చెన్నైలోని తన నివాసంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం బాధ్యతగా స్వీకరించాలని కోరారు.