టీం పిడికిలి గోడప్రతులు ఆవిష్కరించిన నెల్లిమర్ల జనసేన

నెల్లిమర్ల, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చనిపోయిన 3000 మంది కౌలు రైతుల కుటుంబాలకు అండగా నేనున్నానని భరోసా ఇస్తూ ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున 30 కోట్ల రూపాయలు అందిస్తున్న ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా “టీం పిడికిలి” వారు అందించిన వాల్ పోస్టర్స్, స్టిక్కర్లు ద్వారా జనసేన పార్టీనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ గ్రామాన బలోపేతం చేస్తూ, ప్రజలను చైతన్యపరిచే ఈ కార్యక్రమం గురించి క్రియాశీలక జనసేన కార్యకర్తలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.