యాక్సిడెంట్ లో గాయపడిన జనసైనికులకు మనోధైర్యాన్నిచ్చిన జనసేన నాయకులు

పిఠాపురం, కందరాడ గ్రామంలో గత కొన్నిరోజుల క్రితం రెండు వేరు వేరు ఘటనలలో బైక్ యాక్సిడెంట్ కి గురయి గాయపడిన జనసైనికులు సైతనరాజ, అయ్యప్పలను పరామర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకొని మాటలకే పరిమితమవ్వని భరోసాతో ఎటువంటి అత్యవసరం ఏర్పడినా నిర్మొహమాటంగా తమను సంప్రదించవచ్చునని తెలిపిన జనసేన నియోజకవర్గ నాయకులు వెన్నా జగదీష్ (ఎం.ఏ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్), స్థానిక జనసేన ఎంపిటిసి పిల్లా సునీత (దినేష్) మరియు జనసేన నాయకులు యర్రంశెట్టి బాబ్జీ. ఈ కార్యక్రమంలో భాగంగా గాయపడిన సోదర జనసైనికులను పరమర్చించిన విరవాడ జనసేన ఎంపిటిసి అభ్యర్థి రామిశెట్టి సూరిబాబు స్థానిక జనసైనికులు పిల్లా శ్రీనాధ్, సతీష్, సాయి, విన్నుకోట నాని, పసుపులేటి అప్పారావులు తీరంశెట్టి ఈసాకు, బత్తిన దొరబాబు, పెనుపోతుల చక్రి మరియు గంజి గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు.