నాగర్ కర్నూల్ జిల్లా జనసైనికులందరు సిద్ధం కావాలి

*జనసేన పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంటరి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్ జానీ

నాగర్ కర్నూల్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణి కార్యక్రమం జూన్ 12 ఆదివారం రోజున జరగనున్నది. కనుక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణి కార్యక్రమానికి నాగర్ కర్నూల్ జిల్లా సీనియర్ నాయకులు, యువ నాయకులు మరియు క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న సభ్యులందరు పెద్ద ఎత్తున నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని జనసేన పార్టీ కార్యాలయం వద్దకు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా జానీ తెలిపారు.