ఈదరలో ఘనంగా జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

ఉమ్మడి కృష్ణాజిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆగిరిపల్లి గ్రామములో వేదికగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ మరియు క్రియాశీలక కార్యకర్తల ప్రమాద భీమా కిట్లు పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఆగిరిపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షులు జలసూత్రం పవన్ ఆధ్వర్యంలో సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ, జిల్లా సంయుక్త కార్యదర్శి రెడ్డి మణి, నూజివీడు నియోజకవర్గ వీరమహిళ రామిశెట్టి తేజస్వని, ఆదిలక్ష్మి, మండల అధ్యక్షులు జలసూత్రం పవన్, వైస్ ప్రెసిడెంట్ అన్నమనేని రమేష్, ముక్కు ఉమ సాయి మహేష్, పొన్నురి రాము, కొండిశెట్టి శ్రీనివాసరావు, కిషోర్, కురాకుల ప్రసాద్, వెంకటేశ్వరావు, శ్రీను, మణికంఠ, పండు, అంజి, క్రాంతి, విజయ్ మండల కార్యవర్గం, మండల నాయకులు భారీ ఎత్తున జనసేనపార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.