పవన్ కళ్యాణ్ నేతృత్వంలోనే రాష్ట్రానికి మంచిరోజులు: పార్వతి నాయుడు

గుంటూరు: వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రజలెవరూ సుఖసంతోషాలతో లేరని, అన్ని వర్గాల ప్రజల జీవనవిధానం అస్తవ్యస్తమైపోయిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రానికి మంచిరోజులు రానున్నాయని.. ప్రజలెవ్వరూ అధైర్యపడొద్దని.. రీజనల్ కో ఆర్డినేటర్ పార్వతి నాయుడు అన్నారు. క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేసిన వారిని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతంలో క్రియాశీలక సభ్యులది కీలకపాత్ర అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపధ్యంలో.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ.. ఏ పార్టీకి లేనంత క్రియాశీలక కార్యకర్తల బలం జనసేనకు ఉందన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారితో మమేకం అవుతూ పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్ట పరచేందుకు అందరూ కలిసికట్టుగా కృషిచేయాలన్నారు. అనంతరం సభ్యత్వాలు చేయించిన కొత్తకోటి ప్రసాద్, కొనిదేటి కిషోర్, అరుణ, రవి కుమార్, కొప్పుల కిరణ్, ఆసియా, మాధవి, మల్లేశ్వరి, నరసింహరావు, సత్యనారాయణ, దేవిలను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు బిట్రగుంట మల్లిక, అడపా మాణిక్యాలరావు, అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, ప్రధాన కార్యదర్శిలు కొప్పుల కిరణ్, నారదాసు ప్రసాద్, కొండేటి కిషోర్, అన్నదాసు సుబ్బారావు, దాసరి వెంకటేశ్వరరావు, కొట్టు రవి, నవీన్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.