జన సైనికులకు కొండంత భరోసా క్రియాశీలక సభ్యత్వం: రేఖ గౌడ్

ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నందు ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇంచార్జ్ రేఖ గౌడ్ జనసేన కార్యకర్తలకు క్రియాశీలక సభ్యత్వం కిట్లను పంపిణి చేశారు. ఈ సందర్భంగా రేఖ గౌడ్ మాట్లాడుతూ.. చెప్పుకోవడానికి ప్రాంతీయ మరియు జాతీయ పార్టీలు ఎన్ని ఉన్న కార్యకర్తలని కేవలం ఒక ఓటు బ్యాంకుగా చూస్తున్నారని.. దీనికి భిన్నంగా కార్యకర్తల్ని సొంత కుటుంబ సభ్యులుగా భావించి.. ఐదులక్ష విలువగల ఇన్సూరెన్స్ ప్రతి ఒక్క జనసైనికుడికి చేయించిన ఘనత జనసేనాని పవన్ కళ్యాణ్ గారిది అని కొనియాడారు. నేటి సమాజానికి పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు అవసరం ఎంతో ఉందని.. ఏ పదవి లేకున్నా కార్యకర్తలకు, కౌలు రైతులకు అండగా నిలిచిన చరిత్ర పవన్ కళ్యాణ్ గారిది అని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలు ఇప్పటికైనా మేలుకొని మచ్చలేని నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని రాబోయే ఎన్నికల్లో గెలిపించి.. ప్రజా ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్, రాష్ట్ర చేనేత వికాస్ రాష్ట్ర కార్యదర్శి రవి ప్రకాష్, కరణం రవి, షబీర్, రమేష్, మురళి, రషీద్, శేఖర్, నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.