కడలి శ్రీను కుటుంబాన్ని పరామర్శించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం నియోజకవర్గం: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ గురువారం ఇటీవల స్వర్గస్తులైన అనాతవరం గ్రామానికి చెందిన కడలి మంగాయమ్మ కుమారుడు కడలి శ్రీను కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరివెంట జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ జక్కంశెట్టి బాలకృష్ణ, పండు, జిల్లా ఉపాధ్యక్షులు సాన బోయిన మల్లికార్జున రావు, గూడూరు మండల అధ్యక్షులు గొల్ల కోటి వెంకటేశ్వరావు, కడలి కొండ పాల్గొన్నారు.