నిడమానూరులో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

విజయవాడ రూరల్, గన్నవరం నియోజవర్గం జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, రాజకీయ వ్యవహారల కమిటీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు జనసేన పార్టీ క్రియశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ మరియు నమోదు చేయించిన వాలంటీర్లను సత్కరించే కార్యక్రమాన్ని విజయవాడ రూరల్, గన్నవరం నియోజవర్గం, నిడమానూరు గ్రామం లో మండల అధ్యక్షుడు పొదిలి దుర్గారావు ఆధ్యర్యంలో జనసేన పార్టీ క్రియశిలక వాలంటీర్లను శాలువాతో సన్మానించి పార్టీ తరఫున అభినందిస్తూ పవన్ కళ్యాణ్ పంపిన ప్రశంసా పత్రమును పార్టీ జెండాతో సత్కరించడం జరిగింది. అలాగే ప్రతి క్రియాశీలక సభ్యులకు కిట్లు పంపిణీ చేయటం జరిగింది. పార్టీకి చెందిన కార్యకర్తలకు పార్టీ బలోపేతం దిశగా పని చేసి గ్రామస్థాయిలో జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు తెలియజేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాయపాటి అరుణ మరియు చలమలశెట్టి రమేష్, జనసేన పార్టీ కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండల అధ్యక్షులు పొదిలి దుర్గారావు జిల్లా, కార్యవర్గ సభ్యులు గ్రంధం గోవర్ధన్ రావు, చిమట రవివర్మ, నియోజకవర్గ నాయకులు కళ్యాణ్ హర్ష, లంకె సురేష్, సతీష్, వీరమహిళలు మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.