పవన్ కళ్యాణ్ ఆదేశాలతో డాక్టర్ కందుల సేవా కార్యక్రమాలు

★ దక్షిణ నియోజకవర్గంలో నిర్విరామంగా సాగుతున్న కార్యక్రమాలు
★ ప్రతి రోజు వార్డు పర్యటనలు
★ 41వ వార్డులో ఆటో డ్రైవర్లకు యూనిఫారాలు పంపిణీ
★ సుమారుగా 4 వేల యూనిఫారాలు అందజేత

విశాఖ దక్షిణం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు తెలిపారు. శుక్రవారం 41వ వార్డు జ్ఞానాపురం భీమేశ్వర ఆటోస్టాండ్ ఆధ్వర్యంలో డాక్టర్ కందుల నాగరాజు చేతులు మీదుగా ఆటోడ్రైవర్లకు అలాగే మహిళా ఆటో డ్రైవర్లకు కూడా యూనిఫారాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్పూర్తితో తాను ప్రజలకు మరింత చేరువై వారికి సేవలను అందిస్తున్నట్లు చెప్పారు. పార్టీ తరుపున ప్రజా సమస్యల పై పోరాటం చేస్తున్నట్లు వెల్లడించారు. పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచనలతో, సలహాలతో ఇక్కడ పార్టీ నాయకత్వం సమన్వయంతో కలసి పనిచేస్తుందన్నారు. ప్రజా సమస్యల పై జనసేన నిర్విరామంగా పోరాటం చేస్తుందని అన్నారు. అదే సమయంలో దక్షిణ నియోజకవర్గంలో తాను పార్టీ నాయకత్వంతో కలసి పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.
అదే కాకుండా పలు సేవా కార్యక్రమాలను కూడా చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు సుమారు 4 వేల మంది ఆటో డ్రైవర్లకు యూనిఫారాలు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సుంకు వెంకటేశ్వరరావు, 41వ వార్డు పార్టీ ప్రెసిడెంట్ అంథోని శేఖర్, సీనియర్ నాయకులు వంశీ కృష్ణ, భీమేశ్వర ఆటోస్టాండ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, సెక్రెటరీ గిరికుమార్, లలిత, హేమ, సునీత, కుమారి, కేదార్నాధ్, బద్రినాధ్ తదితరులు పాల్గొన్నారు.