పున్నానపాలేం ఉపాధి కూలీలతో కరిమజ్జి మల్లీశ్వారావు భేటీ

*పవనన్న ప్రజాబాట 66వరోజు.. కార్యక్రమానికి ప్రజలనుండి అపూర్వమైన స్పందన

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, ఎచ్చెర్ల మండలంలో.. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన పార్టీ నాయకులు సోసైటి బ్యాంకు మాజీ చైర్మన్ కరిమజ్జి మల్లీశ్వారావు, జనసేన పార్టీ యంపీటిసి అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు బుధవారం ఉదయం పున్నానపాలేం చెరువులో పర్యటించి.. చెరువులో ఉన్న ఉపాధి కూలీలను ప్రతి ఒక్కరినీ కలవడం జరిగింది.

జనసేన పార్టీ మేనిఫెస్టో గురించి ప్రతి మహిళకు, యువతకు,పెద్దలకు, తెలియజేస్తూ.. పవనన్న ప్రజాబాట ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించి 66 రోజులు పూర్తిచేసుకుని.. సుదీర్ఘంగా ప్రజలు దగ్గరకు వెళ్ళి పలు కుటుంబాలను పలకరిస్తూ.. ముందుకు సాగడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధి కూలీలతో కరిమజ్జి మల్లీశ్వారావు మాట్లాడుతూ.. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు భరోసా యాత్రలో బాగంగా 3000 మంది చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలను నేరుగా పరామర్శించి.. ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు విరాళం అందిస్తున్న.. గొప్ప మనసున్న నాయకుడని.. అలాంటి నాయకుడిని కాపాడు కోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలియజేశారు. అలాగే వివిధ విషయాలు గురించి వివరించి వాళ్లకు అవగాహన కల్పించారు. కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. అలాగే వృద్దులతో మాట్లాడుతూ.. సామాన్య ప్రజలకు న్యాయం జరగాలంటే.. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. అలాగే రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు నేరవేర్చే హామీలను వివరించడం జరిగింది.

గృహిణులకు వంటగ్యాస్ ఫ్రీ, తినడానికి పనికి రాని రేషన్ బియ్యం బదులుగా 2500-3500 ఆకౌంట్ లో డబ్బులు జమ, తెల్ల రేషన్ కార్డు వాల్లకి ఇసుక ఫ్రీ, నిరుద్యోగులకు సంవత్సరానికి 5లక్షల ఉద్యోగాలు.. ప్రవేటు రంగంలో మరియు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాడానికి ఆర్థిక సాయం మొదలగు విషయాలను ప్రజలకు వివరించడం జరిగింది. తాము ప్రారంభించిన పవనన్న ప్రజాబాట కార్యక్రమానికి ప్రజలనుండి అపూర్వ స్పందన లభిస్తోందని.. గత ఎన్నికల సందర్భంగా ఒక్క ఛాన్స్ జగన్ కి ఇద్దాం అని ఓటేసిన వారెవరూ ఈసారి వైసిపికి ఓటు వేసేందుకు సిద్ధంగా లేరన్నారు. మా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా గెలిపించికోవాలని ఈ సందర్భంగా ప్రజలు తమ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పున్నానపాలేం గ్రామ,ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.