కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి ఆర్ధికసాయమందించిన కాంతిశ్రీ

ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, తామడ పంచాయతీ, సూర్యనారాయణపురం గ్రామానికి చెందిన కిడ్నీ సమస్యతో బాధపడుతున్న నడుపూరు ప్రభాకర్ (22 సంవత్సరాలు) నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి అని తెలుసుకొని‌ ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ పరామర్శించడం జరిగింది. ఆ కుటుంబ సభ్యులకు దైర్యంగా చెప్పి జనసేన పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తరపున, కాంతిశ్రీ తరుపున వైద్యం ఖర్చులు నిమిత్తం 10000/- రూపాయలు ఆర్ధిక సహాయం ఆ కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళ నాగమణి, లావేరు మండల నాయకులు కాకర్ల బాబాజీ, శంకర్, నాని, నీలం నాయుడు, నారాయణరావు, శ్రీరామ్, శ్రీను(ఎం.ఎస్), రమేష్, సూర్యారావు, సత్యనారాయణ పాలల్గొన్నారు.