Mummidivaram: జనసేనాని చిత్రపటానికి పాలాభిషేకం చేసిన దళిత సంఘాలు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ దళిత నాయకులు శ్రీ దామోదరం సంజీవయ్య ఇంటిని స్మారక చిహ్నంగా తీర్చిదిద్దేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ విరాళం ప్రకటించడం పట్ల దళిత సంఘాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు జిల్లాకు శ్రీ దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలన్న డిమాండ్ తో దళితుల పట్ల శ్రీ పవన్ కళ్యాణ్ కు ఉన్న గౌరవం బయటపడిందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా, ముమ్మడివరంలో జనసేనపార్టీ సంయుక్త కార్యదర్శి శ్రీ తాళ్లూని ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీ బి.ఆర్. అంబేద్కర్, శ్రీ దామోదరం సంజీవయ్యలతో పాటు శ్రీ పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ పితాని బాలకృష్ణ పాల్గొన్నారు.