జనసేన పార్టీలో చేరిన ప్రముఖ వ్యాపార వేత్త బంటి క్రిస్టఫర్
ఎర్రగొండపాలెం నియోజకవర్గం, మెకానిక్ ఇంజనీరింగ్ చదివి, వ్యాపార రంగంలో స్థిరపడిన ప్రముఖ వ్యక్తి బంటి క్రిస్టఫర్ జనసేన పొలిటికల్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో.. జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు రియాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జ్ గౌతం రాజు, ప్రముఖ జనసేన నాయకుడు కందుకూరు బాబు, జిల్లా జాయింట్ సెక్రెటరీ సురేష్ బాబు, సమక్షంలో 50 మంది కార్యకర్తలతో క్రిస్టఫర్ జనసేన లో చేరడం జరిగింది. ఈ సందర్భంగా క్రిస్టఫర్ మాట్లాడుతూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు విధి, విధానాలు, సంకల్పం, పట్టుదల, నిజాయితీ, దానగుణం, అన్నీ నాకు మనస్పూర్తిగా నచ్చి, పార్టీలో చేరడం జరిగింది అని తెలియజేశారు. జనసేన జిల్లా జాయింట్ సెక్రటరీ సురేష్ మాట్లాడుతూ.. క్రిస్టఫర్ అన్న నన్ను తమ్ముడు అని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు.. మంచి వ్యక్తి అటువంటి వారు పార్టీలోకి రావడం.. నేను కూడా భాగస్వామి కావటం ఆనందంగా ఉంది. ఎర్రగొండపాలెంలో గౌతమ్ సార్ క్రిస్టఫర్ అన్న కలిస్తే జనసేన తప్పకుండా విజయం సాధిస్తుందని తెలియచేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/288204004_2072517402921076_936397506748058817_n-1024x682.jpg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/288513223_2072517432921073_4133512084684358889_n-1-1024x682.jpg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-20-at-11.50.11-AM-1-1024x1024.jpeg)