బండారు శ్రీనివాస్ నాయకత్వంలో జనసేనలో భారీ చేరికలు

*జనసేన పార్టీలోకి మడికి గ్రామ శివారు చిలకలపాడు, మల్లవానితోట గ్రామాలలో అన్నివర్గాల నుంచి భారీగా చేరికలు! *జనసేన నేతబండారు శ్రీనివాస్ హర్షo!

కోనసీమ జిల్లా, ఆలమూరు మoడలంలో.. మడికి గ్రామం శివారు మల్లవాని తోట, చిలకలపాడు గ్రామాలలో అన్ని వర్గాల నుంచి జనసేన పార్టీలోకి బండారు శ్రీనివాస్ నాయకత్వంలో భారీగా చేరికలు. ఈ కార్యక్రమంలో అన్నిపార్టీలకు చెoదిన పలువురు ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు, అన్ని వర్గాలనుoచి మరియు బీ సి, శెట్టిబలిజ, యస్ సి, వర్గాల నుంచి ఆదివారం రాత్రి భారీగా చేరికలు జరిగాయి, ఈ సందర్భంగా జనసేన పార్టీలోకి అనూహ్యంగా పెరిగిన అభిమానానికి బండారు శ్రీనివాస్ పేరుపేరునా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతూ.. అందరితో ఎంతో ఆత్మీయతతో.. జససేన పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి నమస్కారములు తెలియచేశారు. రోజురోజుకీ జనసేనానిపై అన్ని వర్గాల వారు ఎంతో ఆత్మీయతతో, ప్రేమానురాగములు చూపించడం ఎంతో గొప్ప విషయమని.. జససేనాని అందరివాడని.. ఒక వర్గానీకి చేoదినవాడు ఏoత మాత్రము కాదనీ.. ఈ భారిచేరికలే నిదర్శనమని బండారు శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో మడికి గ్రామ యవనాయకుడు కొత్తపల్లి నగేష్ నాయకత్వంలో ఈ భారీ చేరికలు జరగడం ఎoతో అనoదంగా ఉన్నదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీరమహిళలుతోపాటు, జిల్లా ప్రదానకార్యదర్శి లు, సంగీత్ సుభాష్, తాళ్ల దేవిడ్, ఆలమూరు మండల అధ్యక్షులు సూరప్ప రెడ్డి సత్య, కొత్తపల్లి నాగేష్, ఎంపీటీసీ ఉండ్రారాజుపు, ఎంకన్న, ఎంపీటీసీ తమ్మన భాస్కర్ రావు, కర్రీ గంగరాజు, మల్యాల హరిప్రసాద్, పంపన సురేష్, కొత్తపల్లి బుజ్జియా, మద్ది రెడ్డి రాజు, ఉండ్రా జూపు విజయ్ కుమార్, మల్లవరపు రాజు, పేరపు దుర్గాప్రసాద్ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.