ఐపీఎల్ 27వ మ్యాచ్ లో ఢిల్లీపై ముంబై విజయం
అబుదాబి వేదికగా ఐపీఎల్ 27వ మ్యాచ్ ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 162 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ముంబయి 19.4 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించింది. డికాక్ (53), సూర్యకుమార్ (53) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఈ విజయంతో ముంబయి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. రోహిత్ సేనకు వరుసగా ఇది నాలుగో విజయం.
ఛేదన ఆరంభించిన ముంబయికి గొప్ప ఆరంభమేమి దక్కలేదు. నిదానంగా ఆడిన రోహిత్ శర్మ (5, 12 బంతుల్లో) అయిదో ఓవర్లోనే వెనుదిరిగాడు. అయితే వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన సూర్యకుమార్తో కలిసి డికాక్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరు కలిసి బౌండరీల మోత మోగించారు. ఈ క్రమంలో డికాక్ 32 బంతుల్లో అర్ధశతకం సాధించాడు. అయితే దూకుడుగా ఆడే క్రమంలో అశ్విన్ బౌలింగ్లో షా చేతికి చిక్కాడు. అనంతరం ఇషాన్ కిషన్ (28)తో కలిసి సూర్యకుమార్ మరింత చెలరేగాడు. సిక్సర్లు, ఫోర్లు సాధిస్తూ 30 బంతుల్లో హాఫ్సెంచరీ పూర్తిచేశాడు. అయితే సూర్యను రబాడ బోల్తా కొట్టించాడు.