కొత్తచెరువు గ్రామంలో జనసేనలో చేరికలు

కొత్తచెరువు గ్రామంలో నివాసముంటున్న(స్వగ్రామం – మారాల) నాగరాజు నాయక్, జ్యోతి బాయి మరియు విష్ణువర్ధన్ నాయక్ లు కుటుంబ సమేతంగా కొత్తచెరువు మండల అధ్యక్షులు పూల శివ ప్రసాద్ ఆధ్వర్యంలో మండల పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. జ్యోతి బాయ్ మాట్లాడుతూ వారి స్వగ్రామమైన మారాల గ్రామంలో తరాల నుంచి రెండే పార్టీలు రెండు కుటుంబాలు మాత్రమే పాలిస్తున్నారు తద్వారా గ్రామంలో మరియు గిరిజన ప్రాంతమైన తండాలో ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదు, మౌలిక సదుపాయాలు అయిన రోడ్లు త్రాగునీరు కరెంటు వంటి సౌకర్యములు సరిగా లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణంగా గ్రామంలో ప్రజలు వలసలు ఇతర గ్రామాల్లో నివసిస్తున్నారు. మేము కూడా మా స్వగ్రామం వదిలేసి కొత్తచెరువు గ్రామంలో గత 18 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నాము. కుటుంబ పరిపాలనలు పోవాలని కోరుకుంటూ రాజకీయాలలో కొత్త నాయకత్వంలను ప్రోత్సహిస్తున్న జనసేన పార్టీలో చేరుకున్నాము మా ద్వారా మా గ్రామంలో మార్పు రావాలని మేము ఆశిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బోయ నాగమణి, మేడాపురం గంగావత, ముత్త నరేంద్ర, హనుమంత్ నాయక్, సల్లప్ప, తేజ, పసుపులేటి సూర్యనారాయణ, పూల రెడ్డప్ప, దొడ్డిగుంట నరేంద్ర, గుడా మధు, గూడా శ్రీనివాసులు మరియు తదితర జనసైనికులు పాల్గొన్నారు.