ఓ మైనారిటీ మేలుకో

బుక్కరాయ సముద్రం, దులహన్ పథకంపై రాష్ట్ర హైకోర్టు నందు దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున దుల్హన్ పథకం కొరకు నిధులు లేవని పేర్కొనటాన్ని మైనార్టీలు తీవ్రంగా ఖండించారు. ఎన్నికల సమయంలో రూ.50 వేలు కాదు లక్ష రూపాయలు ఇస్తామని మైనార్టీలను మోసం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజీనామ చేయాలని డిమాండ్ చేశారు. మా ఆడ బిడ్డల ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. ఇప్పటికైనా వైస్సార్ పార్టీలో ఉన్న మైనార్టీలు మేలుకొని, ఆత్మీయ మైనార్టీల కొరకు గళం విప్పాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల ప్రధాన కార్యదర్శి అరటి తహీర్, తుంచర్ల బాబా ఫక్రుద్దీన్ వలి, కరెంట్ పీరా, మహమ్మద్ రఫీ, ఖాదర్ వలి, టోపీ భాష, ఎస్ మహబూబ్ బాషా, షాక్షావలి, సంచుల భాష అత్దితరులు పాల్గొన్నారు.