జనసేన విస్తృత స్థాయి సమావేశం

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, పోలవరం నియోజకవర్గం, టి. నర్సాపురం మండల జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జిల్లా కార్యదర్శి గట్టమనుగుల రవికుమార్, టి.నర్సాపురం పార్టీ అధ్యక్షులు అడపా నాగరాజు ఆధ్వర్యంలో జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గం ఇంచార్జి చిర్రి బాలరాజు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఉమ్మడి పశ్చిమగోదావరి జనసేన పార్టీ అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, పిఏసి మెంబర్, నర్సాపూరం ఇంచార్జి మరియు మత్యకార వికాస విభాగం రాష్ట్ర చైర్మన్ బొమ్మిడి నాయకర్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.ఘంటసాల వెంకటలక్ష్మి, ఏలూరు ఇంచార్జి మరియు జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు, తాడేపల్లిగూడెం ఇంచార్జి బోలిశెట్టి శ్రీనివాస్, చింతలపూడి నియోజకవర్గ ఇంచార్జి మేకా ఈశ్వరయ్య, ఉంగుటూరు నియోజకవర్గ నాయకులు పత్సమట్ల ధర్మరాజు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు యంట్రపాటి రాజు, నవుడు బాజీ మరియు జిల్లా కార్యదర్శులు, నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, నాయకులు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం పోలవరం నియోజకవర్గంలోని జీలుగుమిల్లి మండలానికి చెందిన సుమారు 100 మంది మహిళలు పార్టీలో చేరడం జరిగింది.