కేశవదాసుపాలెం గ్రామ జనసేన అధ్యక్షుడిగా మండెల బాబి నాయుడు ఏకగ్రీవ ఎన్నిక

రాజోలు నియోజవర్గం, సఖినేటిపల్లి మండలం, కేశవదాసు పాలెం గ్రామ జనసేన పార్టీ నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా మండెల బాబి నాయుడు ఎన్నికయ్యారు. జనసేన పార్టీ రాజోలు నియోజకవర్గ నాయకులు జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు ఘనంగా సన్మానించారు. జనసేన కొత్త తరానికి అవకాశం ఇవ్వడంలో ముందు ఉంటుందని, రాజోలు నియోజకవర్గంలో జనసేన బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని బాబీ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు జనసేన నాయకులు మరియు జనసైనికులు బాబి నాయుడుకి అభినందనలు తెలిపారు.