భారీ వర్షాలపై ఉప రాష్ర్టపతి వెంకయ్యనాయుడు ఆందోళన

కర్ణాటక, ఒడిశా మరియు, తెలుగు రాష్ర్టాల్లో కురుస్తున్న భారీ వర్షాలపై ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు బుధవారం స్పందించారు. వర్షాల కారణంగా ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులపై ఆందోళన వ్యక్తం చేశారు. భారీ వర్షపాతం నమోదవటం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లిన వారికి సానుభూతి ప్రకటించారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ అధికారుల సూచనలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని ట్విటర్‌ వేదికగా ఆయన కోరారు.