జనంలోకి జనసేన కార్యక్రమం చేపట్టిన మాడుగుల నియోజకవర్గ జనసేన రాయపురెడ్డి కృష్ణ
మాడుగుల, జనంలోకి జనసేన అనే కార్యక్రమాన్ని మాడుగుల నియోజకవర్గం యువనాయకులు రాయపురెడ్డి కృష్ణ మొదటి రోజు జాలం పల్లి పంచాయతీలో ప్రారంభించడం జరిగింది. సోమవారం సుమారు 320 గడపలకు జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాస్ ఇచ్చి జనసేన పార్టీ సిద్ధాంతాలు వివరించడంతో పాటు ప్రజా సమస్యలను అడిగి తెలుసుకొని వారికి అండగా ఉంటామని తెలియజేయడం జరిగింది. వచ్చే ఎన్నికలలో అందరం కష్టపడి పని చేసి మాడుగుల నియోజకవర్గం గెలుపును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి బహుమతిగా ఇస్తామని రాయపురెడ్డి కృష్ణ తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొని గడప గడపకి రాయపురెడ్ది కృష్ణతో పాల్గొన్నారు. గ్రామస్తులకి జనసేన పార్టీ సిద్ధాంతాలు తెలియజేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-04-at-2.26.25-PM-1024x682.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-04-at-2.26.24-PM-1-1024x683.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-04-at-2.26.25-PM-1-1024x682.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-04-at-2.26.24-PM-1024x682.jpeg)