ప్రజలు మిమ్మల్ని కొట్టే రోజులు అతి దగ్గరలోనే.. అంబటిని హెచ్చరించిన రెడ్డి అప్పలనాయుడు

జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలలో నవసందేహాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ గారు అడిగితే.. దానిని కప్పిపుచ్చుకోవడానికి పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజీ అని విమర్శించడం సరైన విధానం కాదని అంబటి రాంబాబు నీ హెచ్చరించిన పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు..

ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెడ్డి అప్పల నాయుడు రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.. ఆయన మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా అంటే దాదాపు 37,38 నెలలుగా పరిపాలించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారి ఘనకార్యం చెప్పుకోవడానికి మాత్రమే ప్లీనరీని ఏర్పాటు చేసుకున్నారు..

ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు మీద పలు విమర్శలు గుప్పించారు.. ఈరోజు జరుగుతున్న ప్లీనరీలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఆంబోతు మంత్రి గతంలో పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా బ్రోకరిజం చేశాడా ?.. పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజీ ఇచ్చేదగ్గర ఉన్నాడా?.. పవన్ కళ్యాణ్ గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేశాడా ?.. పవన్ కళ్యాణ్ గారి దగ్గర బ్రోకర్ గా పనిచేసిన అనుభవం ఆంబోతు మంత్రి కీ ఉందేమో ? పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజీ ఇస్తే చాలు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారని పోరంబోకు మాటలు మాట్లాడుతూ కుక్కలా అరుస్తూ ఉంటావు అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు..

మీకు కనీసం ఇంగిత జ్ఞానం లేదు.. పరిపాలన మీద అవగాహన లేదు.. ఏ విధంగా చట్టసభల్లో మంత్రి గా ఉండాలో తెలీదు.. ఎదుటి పార్టీ వారితో ఏం మాట్లాడాలి.. మీ ప్లీనరీ ద్వారా మీ కార్యకర్తలకు, నాయకులకు ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఏ రకమైనటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు.. మీరు అందించిన పరిపాలన లో ఏ మంచి ఘనకార్యాలు చేశారని చెప్పుకోవడం మానేసి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజానీకం కోసం పోరాడుతూ ఉంటే రాష్ట్రంలో ఉన్న రైతాంగం కానీ, కార్మిక రంగం కానీ, శ్రామిక రంగం కానీ, వ్యాపారస్తులు కానీ,ఉద్యోగస్తుల సమస్యల మీద కానీ స్పందిస్తూ అధికారంలో లేకపోయినా ప్రజాపక్షాన పోరాటం చేస్తున్న ఒక నాయకుడిని ప్యాకేజీ అని ఏ ఉద్దేశ్యంతో అంటున్నావు..ఇంతకు ముందు నువ్వు బ్రోకరిజం చేశావా? అసలు నీ శాఖ ఏంటి ? ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడూ.. నీకిచ్చిన హోదాకు న్యాయం చేయడం పోయి పనికి మాలిన మాటలు మాట్లాడటం.. జగన్ రెడ్డి మెప్పు కోసం జగన్ మోహన్ రెడ్డి కాళ్ళకు నమస్కారాలు చేయడం .. ఆయన దగ్గర మార్కులు కొట్టడం కోసం పవన్ కళ్యాణ్ గారిని తిడితే మీకు మార్కులు వస్తాయి అనే ఉద్దేశంతో కనీస సామాజిక స్పృహ మరిచిపోయి మాట్లాడుతున్నటువంటి ఆంబోతు మంత్రి ఇప్పటికైనా తెలుసుకోవాలని హితవు పలికారు..

రేపు ఎలాగో మిమ్మల్ని ఇంటికి పంపడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తరువాత మీరు ఏ గుడి దగ్గరో కూర్చొని అడుక్కు తినే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయడం మాని మీకిచ్చిన అధికారాన్ని రాష్ట్ర ప్రజలకు న్యాయం చేసే పద్ధతిలో మీరు కొనసాగండి..

ఇంతకుముందు విమర్శలు చేసిన పేర్ని నాని నీ పాలేరు నాని చేసిన జగన్ మోహన్ రెడ్డి నీ అంతకుముందు ఇరిగేషన్ మంత్రి గా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ఏమయ్యారో అనేది గతం చెబుతూనే ఉంది.. ఇప్పటికైనా పాలు పిసికే బుద్ధులు మాని ఒక నాయకుడిగా రాష్ట్ర ప్రజలు మీకిచ్చిన ప్యాకేజీ కీ న్యాయం చేసి.. ప్రజలకు కూడా మేలు చేసే వైపుగా ప్రయాణం చేస్తే బాగుంటుందని ప్రజలు మిమ్మల్ని కొట్టే రోజులు అతి దగ్గరలో నే ఉందని తీవ్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు..