సమగ్ర శిక్షా అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మెకు పితాని మద్దతు

విద్యాశాఖ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగుల ఉద్యోగాలు రెగ్యులర్ చెయ్యాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ముమ్మిడివరం ఎయిమ్స్ కాలేజ్ దగ్గర సమ్మె మొదలుపెట్టారు. జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ వారికి సమ్మె రెండవరోజు వారికి మద్దతు తెలుపడం జరిగింది. సమ్మె నాలుగవ రోజులో భాగంగా పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు సుమారు 350 మంది కాంట్రాక్టు ఉద్యోగస్తులకు ఎయిమ్స్ కాలేజ్ దగ్గర భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది. మన జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని విధాలా ఆదుకుంటాం అని బాలకృష్ణ వారికి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు అభిమానులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.