నాదెండ్ల మనోహర్ పర్యటనను విజయవంతం చేయండి: పితాని

ముమ్మిడివరం: కొద్దిరోజుల క్రితం యాక్సిడెంట్ లో మృతి చెందిన జనసేన పార్టీ సీనియర్ నాయకులు మరియు క్రియాశీలక సభ్యులు కీర్తిశేషులు దంగేటి మంగారావు కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి జనసేన పార్టీ 5 లక్షల రూపాయలు భీమా చెక్కును అందించేందుకు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ 14-07-2022 గురువారం కాట్రేనికోన మండలం వేట్లపాలెం వస్తున్న సందర్భంగా.. అధిక సంఖ్యలో జనసేన పార్టీ శ్రేణులు పాల్గొనవలసిందిగా ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో పితాని బాలకృష్ణ కోరారు. అదేవిధంగా రైతు భరోసా యాత్ర సందర్భంగా జరగబోయే బహిరంగ సభకు 16-07-2022 శనివారం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులుసానబోయిన మల్లికార్జునరావు, గుద్దటి జమ్మి, గోదశి పండరీష్, జక్కంశెట్టి పండు, సానబోయిన వీరభద్రరావు, మండల అధ్యక్షులు అత్తిలి బాబూరావు, గోలకోటి వెంకన్నబాబు, మోకా బలప్రసాద్, కడలి కొండ, మద్దిశెట్టి పురుషోత్తం,మరియు నూకల దుర్గ,ఆకాశము కన్న,మాదాల శ్రీధర్ పోలిశెట్టి కుమార్, గణేశుల శ్రీను, బండారు వెంకన్నబాబు, రంబాల శంకర్, కర్ర దుర్గ ప్రసాద్, పాయసం సాయి తదితరులు పాల్గొన్నారు.