ఇంద్రకీలాద్రిపై బాలా త్రిపురసుందరీ దేవిగా దుర్గమ్మ

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై రెండో రోజు దసరా ఉత్సవాల లొ బాగంగా ఈ రోజు బాలా త్రిపురసుందరీ దేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు ఆలయ అధికారులు. ఇక వీఐపీలకు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు దర్శనాలకు అనుమతిని ఇస్తున్నారు. కాగా శనివారం నుంచి ఇంద్రకీలాద్రిలో దసరా మహోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో శనివారం శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు దర్శనం ఇచ్చారు. ఈ నెల 25వరకు ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు జరగనున్నాయి.