#GoodMorningCMSir డిజిటల్ క్యాంపైనింగ్ కు పిలుపు నిచ్చిన తాతంశెట్టి నాగేంద్ర

రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర పత్రికా సమావేశంలో మాట్లాడుతూ..

*మొద్దునిద్ర పోతున్న ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని నిద్రలేపే విధంగా ఈనెల 15,16,17 మూడురోజులు GoodMorningCMSir అనే పేరుతో డిజిటల్ క్యాంపైన్ జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేయు సందర్భంలో కడప జిల్లాలో కుడా ప్రతి జనసైనికుడు, కార్యకర్తలు, వీరమహిళలు, నాయకులు పాల్గొని దిగ్విజయం చేయాలని పిలుపు నిచ్చారు.

*వైసీపీ ప్రభుత్వం వచ్చిన 3 సంవత్సరాలలో 22,750 కోట్లు బడ్జెట్ లో రోడ్ల కోసం ప్రవేశపెట్టిన ఎక్కడా రోడ్డు వేసిన పాపాన పోలేదు అని ఏద్దేవా చేశారు.

*పెట్రోలు మీద ఒక సంవత్సరానికి సెస్ వసూలు 750 కోట్లు వస్తోందని ఈ మూడు సంవత్సరాల సెస్ వసూలు ఏమయిందని, మరియు సెస్ ను తనఖా పెట్టి తెచ్చిన అప్పు 6500 కోట్లు ఏమయ్యాయని నిలదీశారు.

*ప్రతి ఒక్కరు ఈ ప్రభుత్వం యొక్క దమన నీతిని, ఎండగట్టి ప్రజల ముందుంచాలని సూచించారు.