రోడ్ల దుస్థితి పై ఎచ్చర్ల జనసేన డిజిటల్ క్యాంపెయిన్
ఎచ్చర్ల నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు.. గుడ్ మార్నింగ్ సీఎం సార్ డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని ఎచ్చర్ల నియోజకవర్గం, రణస్థలం మండలంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలొ భాగంగా పైడి భీమవరం నుంచి మెంటాడ వరకు రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయని తెలియజేడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు డి. చిరంజీవ పంచాయతీ, నారువ పంచాయితీ జనసేన కార్యకర్తలు, నరసయ్య, రాంబాబు, ప్రసాదు, శ్రీను పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-15-at-3.29.50-PM-1024x576.jpeg)