మోకాళ్ళ మీద నిలబడి వినూత్న నిరసన తెలిపిన రైల్వే కోడూరు జనసేన

ఉమ్మడి కడప జిల్లా, రైల్వే కోడూరు, జనసేన అధ్యక్షులు ఫవన్ ఖల్యన్, పిఏసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న అద్వాన్న రోడ్ల దుస్థితిపై రెండో రోజు జరుగుచున్న డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు నుండి రెడ్డివారిపల్లి రోడ్డు (నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే సొంత గ్రామం) నందు జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర ఆధ్వర్యంలో జనసేన నాయకులు మోకాళ్ళ మీద నిలబడి నిరసన కార్యక్రమం జరిగింది. ఎప్పుడు ఈ బ్రిడ్జి గురించి అడిగిన ఒక సంవత్సరం ఆగండి పాలు పోసుకుని తీసుకోవచ్చు అని 3సంవత్సరాలనుండి చెబుతున్న నేపథ్యంలో అక్కడ పాలు పోసే కార్యక్రమం చేపట్టాము. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంయుక్త, సీనియర్ నాయకులు పగడాల వెంకటేష్, వరికూటి నాగరాజ, ముద్దపోలు రామసుబ్బయ్య, వెంకటాచలపతి, కనుపర్తి శంకరయ్య, గంధంశెట్టి దినకర్ బాబు, మాదం సుబ్రహ్మణ్యం, లక్కాకుల శంకరయ్య యువనాయకులు కొక్కంటి మహేష్, బీదం నవీన్ కుమార్, కొండేటి మనోజ్ కుమార్, సాదు సాయిచంద్, బోనం సందీప్, వంశీ, హరి తదితరులు పాల్గొన్నారు.