రోడ్ల దుస్థితిపై యు.పి.రాజు ఆధ్వర్యంలో నిరసన

*3 వ రోజు #GoodMorningCMSir

ఆముదాలవలస: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు.. రాజాం నియోజకవర్గం నాయకులు యు.పి.రాజు నాయకత్వంలో రేగిడి, ఆమదాలవలస మండలం, ఉంగరాడ మెట్ట జంక్షన్ వద్ద గుడ్ మార్నింగ్ సీఎం సార్ హ్యాస్ ట్యాగ్ తో ముఖ్యమంత్రి కి తెలిసేలా ఆధ్వనంగా ఉన్న రాజాం-పాలకొండ గుంతల రోడ్లు వద్ద డిజిటల్ క్యాంపైన్ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రేగిడి ఆమదాలవలస మండల నాయకులు రెడ్డి బాలకృష్ణ మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్నా ఈ రోజు కి రోడ్లు పరిస్థితి అధ్వానంగా ఉన్న పట్టించుకోకుండా గాఢ నిద్రలో ఉన్న సీఎం నిద్ర వీడి.. ప్రజల సొమ్మును పథకాలు పేరిట దుర్వినియోగం చేయ్యకున్న ఇకనైనా అభివృద్ధి చేయ్యలని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేసారు. ఈ నిరసన కార్యక్రమంలో బలసా.శ్యామ్, పుర్లి. అప్పలనాయుడు, పాపరావు, బుజ్జి, శ్రీనివాసరావు, గౌరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.