బురుగుల రాజుకు మనోధైర్యాన్నిచ్చిన సుంకెట మహేష్ బాబు

నిర్మల్ జిల్లా, వికలాంగుల సంఘం అధ్యక్షుడు బురుగుల రాజుకు పితృ వియోగం. కుటుంబాన్ని పరామర్శించిన జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు భైంసా మండల సుంక్లి గ్రామానికి చెందిన మారుతి(76) ఈ మధ్య కాలంలో అనారోగ్యం కారణంగా చనిపోయారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజు కుటుంబం మనోదైర్యం కోల్పోకుండా దైర్యం ఇచ్చి అండగా నిలుస్తామని అన్ని విషయాల్లో పార్టీ తరపున సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పరమేష్, బోజా రెడ్డి, భుమన్న లు పాల్గొన్నారు.