లైబ్రరీలో వసతులు మెరుగుపరచాలి: సుంకెట మహేష్ బాబు

భైంసా పట్టణంలోని లైబ్రరీ చదువుకోవడానికి కాకుండా ఉపయోగం లేకుండా తయారైంది. గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్నా అక్కడ వసతులు లేకపోవడం చాలా దురదృష్టకరం వెంటనే మంచినీటి సౌకర్యం, ఉరుస్తున్న బిల్డింగ్ రిపేర్, కాలని మధ్యలో ఉన్న గ్రంథాలయానికి రోడ్డు సౌకర్యం అస్సలు బాగా లేదు, ముఖ్యంగా మహిళలు చదువుకోవడానికి వచ్చినప్పుడు బాత్రూమ్ సౌకర్యం లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణలో కోచింగ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పెరిగి డబ్బులు దండుకుంటున్నారు. నిరుద్యోగులు కానిస్టేబుల్, ఎస్ ఐ, తదితర కోచింగ్ ల కోసం పేద మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు చాలా ఉపయోగపడే ఈ లైబ్రరీలో పుస్తకాలు పంపిణీ మరియు బిసి స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు డిమాండ్ చేశారు.