జనసేనాని త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన జార్జిపేట జనసైనికులు

జార్జిపేట జనసైనికుల ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని మరియు పితాని బాలకృష్ణ ఆయురారోగ్యలతో బాగుండాలని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానములో జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ శ్రీమతి ముత్యాల శ్రీజయలక్ష్మీ దంపతులు ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షలు అత్తిలి బాబురావు, టేకుమూడి త్రిమూర్తులు, జార్జిపేట గ్రామ కమిటీ అధ్యక్షుడు కర్ణీడి నాని, జనసైనికులు సలాది వినోద్ కుమార్, పళ్ళ మణికంఠ, గిరి, నాగేంద్ర, వినోద్ పాల్గొన్నారు.