అక్రమ కేసుల పోరాటంలో జనసైనికులకు జనసేన పార్టీ మద్దతు
- పిఠాపురం జనసైనికుని మీద వైసీపీ ప్రభుత్వపు అక్రమ కేస్ బనాయింపు
పిఠాపురం నియోజకవర్గంలో అధికార వైసీపీ నిరంతరం చేస్తున్న దురాగతాలలో, జనసైనికులపై బనాయించిన అక్రమ కేసులో జల్లూరు గ్రామానికి చెందిన పిల్లి సత్యనారాయణ అన్నవరంకు 15 రోజుల క్రితం రిమాండ్ విధించారు. ఈ సమయంలో ఆ జనసైనికునికి అండగా నిలబడి త్వరితగతిన బెయిల్ రావడానికి జనసేన నాయకులు వెన్నా జగదీష్ మరియు జల్లూరు గ్రామానికి చెందిన జనసైనికులు కృషి చేశారు. కష్టకాలంలో జనసైనికునికి అండగా నిలబడిన వీరికి పిఠాపురం జనసైనికులు ధన్యవాదాలు తెలిపారు. అక్రమ కేసులో బెయిల్ పై విడుదలైన పిల్లి అన్నవరంలో మనోధైర్యం నింపి, అక్రమ కేసులపై పోరాటంలో నాయకులు, జనసైనికులు బాధితులకు జనసేన పార్టీ తరుపున మద్దతుగా ఉంటామని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా పిల్లి అన్నవరం, తనకు అండగా నిలబడిన నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-23-at-5.36.33-PM-1024x768.jpeg)