మదు కుటుంబానికి జనసేన అండ!!

పలమనేరు నియోజకవర్గం, బైరెడ్డి పల్లి మండలంకు చెందిన జనసేన నాయకుడు మదు అకాల మరణం చాలా బాధాకరం… విషయం తెలుసుకున్న పలమనేరు నియోజకవర్గ సీనియర్ నాయకులు సందీప్ రాయల్ సోమవారం మదు కుటుంబాన్ని పరామర్శించి.. వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు మరియు వారి ఇద్దరి పిల్లలకు చదువుల బాధ్యత పూర్తిగా తీసుకుంటానని హామీ ఇచ్చారు… ఈ కార్యక్రమంలో పలమనేరు రూరల్ మండల అధ్యక్షడు నాగరాజు మోతుకూరు, గంగవరం మండల నాయకులు వినోద్ మరియు తరుణ్ పాల్గొన్నారు.