65 పోస్టుల భర్తీ కి ఈసీఐఎల్ నోటిఫికేషన్
హైదరాబాద్లోని ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ జాబ్ నోటిఫికేషన్ జారీ చేసింది. టెక్నికల్ పోస్టులు, సైంటిఫిక్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు సహా మొత్తం 65 పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను 2 ఏళ్లకు ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు ఈసీఐఎల్ వెల్లడించింది.
1) టెక్నికల్ ఆఫీసర్: 24 పోస్టులు
విద్యార్హత: 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ పూర్తి కావాలి. కనీసం ఏడాది అనుభవం ఉన్నవారు అర్హులు.
ఈ సెప్టెంబర్ 30 నాటికి (30-09-2020) 30 సంవత్సరాలలోపు ఉండాలి.
వేతనం: రూ. 23,000 నెలకు.
2) సైంటిఫిక్ అసిస్టెంట్: 13 పోస్టులు
విద్యార్హత: 60 శాతం మార్కులతో డిప్లొమా పూర్తి కావాలి. ఏడాది అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ సెప్టెంబర్ 30 నాటికి (30-09-2020) 25 సంవత్సరాలలోపు ఉంటే వయోపరిమితి సరిపోతుంది
వేతనం: రూ.19,864 నెలకు.
3) జూనియర్ ఆర్టిజన్: 28 పోస్టులు
విద్యార్హత: ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. కనీసం ఏడాది అయినా పనిచేసిన అనుభవం ఉండాలి.
ఈ సెప్టెంబర్ 30 నాటికి (30-09-2020) 25 సంవత్సరాలలోపు ఉండాలి.
వేతనం: రూ.18,070 నెలకు.
ఈసీఐఎల్ వెబ్సైట్ https://careers.ecil.co.in/login.php
ఎంపిక విధానం: షార్ట్లిస్టింగ్, వర్చువల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
దరఖాస్తుకు చివరితేది: 02.11.2020
దరఖాస్తువిధానం: ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి
తగిన అర్హతలు, అనుభవం ఉండి ఆసక్తి గల అభ్యర్థులు ఎవరైనా అధికారిక వెబ్సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ పోస్టులు అన్నింటికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.