బ్యాంక్‌ జాబ్స్‌‌ నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం..

న్యూఢిల్లీలోని ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 56 స్పెషలిస్ట్‌ ఆఫీసర్ల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అకడమిక్‌ ప్రతిభ, అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఎక్కువగా వచ్చిన పక్షంలో రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఈ పోస్టులకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్‌ 3 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://psbindia.com/ వెబ్‌సైట్‌ చూడొచ్చు

మొత్తం ఖాళీలు: 56

అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌(లా)- 1

చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్-‌ 1

రిస్క్‌ మేనేజర్లు- 4

ఐటీ మేనేజర్లు- 50

విద్యార్హత వివరాలు: అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ (లా) పోస్టుకు లా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 35 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌కు బీఈ/ బీటెక్ ‌(కంప్యూటర్‌ సైన్స్‌/ ఐటీ)/ఎంసీఏ ఉత్తీర్ణులై ఉండాలి. ఏదైనా ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు డిప్లొమా (కంప్యూటర్‌ అప్లికేషన్స్‌) పూర్తిచేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సీఐఎస్‌ఏ, సీఐఎస్‌ఎస్‌పీ సర్టిఫికేషన్‌ తప్పనిసరి. వయసు 35 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

రిస్క్‌ మేనేజర్లకు ప్రథమ శ్రేణి మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు పీజీ (మేథమెటిక్స్‌/ స్టాటిస్టిక్స్‌/ ఎకనామిక్స్‌/ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌)/ ఎంబీఏ / పీజీ డిప్లొమా(ఫైనాన్స్‌/ బ్యాంకింగ్‌/ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌) పూర్తిచేసి ఉండాలి. సీఏ/ ఐసీడబ్ల్యుఏఐ/ సీఎస్‌ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఐటీ మేనేజర్లకు కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ టెక్నాలజీ/ కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌/ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌/ ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో బిఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌ ఉత్తీర్ణత అవసరం. ఎంసీఏ అభ్యర్థులు కూడా అర్హులే. మేనేజర్‌ పోస్టులకు 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసుండాలి. అన్ని పోస్టులకూ నిర్దేశిత అనుభవం తప్పనిసరి.

ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జీఎస్‌టీతో కలిపి రూ.1003 (దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.177)

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 3, 2021

దరఖాస్తు హార్డు కాపీ చేరేందుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 9, 2021

చిరునామా: ద డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌, అయిదవ అంతస్తు, బ్యాంక్‌ హౌస్‌, 21, రాజేంద్ర ప్యాలెస్‌, న్యూఢిల్లీ – 110008.

వెబ్‌సైట్‌:https://psbindia.com/