కాపు నేస్తం నిధులు జమ కార్యక్రమంలో సీఎం జగన్ కి కాపు నిరసన సెగ

  • కాపు నేస్తం మూడో విడత నిధులు జమ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మొహన్ రెడ్డికి కాపు నిరసన సెగ

కాపు సంక్షేమ శాఖ గొల్లప్రోలు మండల అధ్యక్షుడు మర్రి దొరబాబు అధ్వర్యంలో కాపు యువత ప్లకార్డులతో నిరసన తెలియజేడం జరిగింది… కాపులకు ఎన్నికల సమయంలో సంవత్సరానికి రెండువేల కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ నిధులు మంజూరు చేస్తానని ఇచ్చిన హామీనీ గుర్తు చేస్తూ 3 సంవత్సారాలగా 6 వేల కోట్లు ఎక్కడా అని నిలదీశారు.

జగన్ మోహన్ రెడ్డికి తప్పని కాపుల రిజర్వేషన్.. కేంద్రం మా పరిధిలోలేదు అది రాష్ట్ర పరిధిలోనిది అన్నా వైసీపీ ప్రభుత్వం కాపుల రిజర్వేషన్ ప్రక్కన ఎందుకు పెట్టిందని,
కాపునేస్తంలో 46వేలమంది లిస్టు ఎందుకు గల్లంతయ్యిందని, అర్హులను ఎందుకు తొలగిస్తూన్నరని ప్లకార్డులతో నిరసన తెలిపారు.