అవ్వ కావయమ్మకు జనసైనికుల చేదోడు

రాజోలు: కొన్ని రోజుల క్రితం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాజోలు మండల పరిధిలో గల చింతలపల్లి గ్రామంలో అవ్వ కావయమ్మ పూరి గుడిసె పాడైపోయింది. నిస్సహాయంగా ఎదురు చూస్తున్న సేనాపతి కావయమ్మ ఇంటి పై కప్పును శనివారం రాజోలు వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనంద రాజు ఆధ్వర్యంలో గణసాల రామరాజు ఆర్థిక సహాయంతో బరకంతో కప్పి మరియు నిత్యవసర సరుకులు ఇచ్చి ఆ అవ్వకు అండగా నిలిచారు. రాజోలు వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనంద్ రాజు ఆధ్వర్యంలో తాత్కాలిక ఆవాశం ఏర్పాటు చేసిన చింతలపల్లి గ్రామ జన సైనికులు పిప్పల లక్ష్మణరావు, లంకలపల్లి రమేష్, గానశాల బాలాజీ, గ్రామస్తులు మరియు జన సైనికులను పలువురు అభినందించారు. ఆపన్నులను ఆదుకోవటమే జనసేన పార్టీ ధ్యేయమని వైస్ ఎంపీపీ ఆనందరాజు జన సైనికుల సేవల పట్ల హర్షం వ్యక్తం చేశారు.