జనసేన పార్టీలో చేరిన బోయిన సుధాకర్

పాడేరు: అనంతగిరి మండలం, ఎగువశోభ పంచాయితీకి చెందిన యువనాయకులు బోయిన సుధాకర్ జనసేన పార్టీలో చేరారు. ఆదివారం జనసేన పార్టీ కార్యాలయంలో అనంతగిరి జనసేన పార్టీ అధ్యక్షులు మురళి ఆధ్వర్యంలో, జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్య చేతుల మీదుగా కండువా కప్పుకుని జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్బంగా బోయిన సుధాకర్ మాట్లాడుతూ.. జనసేనాని పవన్ కళ్యాణ్ ఆలోచనాతీరు రాష్ట్రానికే ఆదర్శం. అతను కుటుంబ రాజకీయాలు, కుల రాజకీయాలకతీతంగా ఒక ఆధునిక రాజనీతి వ్యవస్థతో జనసేన పార్టీ స్థాపించారు. ఈ ఆలోచన ఒక గొప్ప మార్పుకి బలమైన సంకేతం. నిజంగా ఆదివాసీ సమాజం శ్రేయస్సుకోరుకోవాలంటే రానున్న ఎన్నికలలో కచ్చితంగా జనసేన పార్టీకి ప్రతి గిరిజనుడు ఓటువేయలి ఎందుకనెంటే టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు గతంలోనే గిరిజనుల ఆస్తిత్వాలపై అత్యాచారాలు చేసాయి ఈ విషయాలు క్షున్నంగా తెలుసుకున్నాక సగటు గిరిజనా యువ నాయకులుగా మాకు మేము భవిష్యత్తు తరాల కోసం ఆలోసించి జనసేనాని అడుగుజాడల్లో నడిస్తేనే అంతిమంగా గిరిజనులకీ న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నామని అన్నారు.ఈ సందర్బంగా ఈ చేరికలో ప్రధాన భూమిక పోషించిన చిట్టం మురళికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చేరిక సందర్బంగా పాడేరు నియోజకవర్గ లీగల్ సెల్ ఇన్చార్జ్ కిల్లో రాజన్, మాదేల నాగేష్, అశోక్, రవి తదితరులు పాల్గొన్నారు.