నాయిని నర్సింహారెడ్డి ఇంట్లో మరో విషాదం

మాజీ హోం మంత్రి, దివంగత నాయకుడు నాయిని నర్సింహరెడ్డి ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. నాయని నర్సింహా రెడ్డి సతీమణి అహల్యకు అనారోగ్యంతో కన్నుమూశారు. నాయినితోపాటు ఆయన సతీమణి అహల్య కూడా కరోనా చికిత్స కోసం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నాయిని నర్సింహారెడ్డి సతీమణి గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. కరోనా నుంచి ఆమె కోలుకున్నా ఊపిరి తిత్తుల లో ఇన్ఫెక్షన్ సోకడం తో చికిత్స పొందుతున్నారు.భర్తను కడసారి చూసేందుకు ఆమె వీల్‌చైర్‌లోనే మహాప్రస్థానానికి చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. భర్తను తలుచుకుంటూ ఆమె కన్నీరుమున్నీరు అయ్యారు.